న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ క్షమాపణలు చెప్పారు. జనవరి 5వ తేదీన ఫిరోజ్పూర్లో రోడ్డుపై ప్రధాని మోదీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే గురువారం రోజున కోవిడ్19 పరిస్థితిపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని మోదీకి ఆ నాటి సంఘటన పట్ల పంజాబ్ సీఎం చన్నీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. మోదీ దీర్ఘాయువుతో జీవించాలని కూడా చన్నీ కోరినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై జనవరి 5వ తేదీనే పంజాబ్ సీఎం క్షమాపణలు చెప్పారు. ప్రధాని భద్రత విషయంలో ఎటువంటి సెక్యూర్టీ లోటు జరగలేదన్నారు. అయితే నిన్న సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమయంలోనూ మరోసారి పంజాబ్ సీఎం క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.