చండీగఢ్ : గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘ఇలా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం చట్టాన్ని, విధానాలను ఉల్లంఘించడమే’ అంటూ గవర్నర్ ఈ నెల 17న పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసారు. దీనిపై సీఎం మన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిపుణులతో చర్చించిన పిదపే తాము ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామన్నారు.