చండీగఢ్, అక్టోబర్ 3: పంజాబ్లోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. సీఎం భగవంత్మాన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాన్ మాట్లాడుతూ పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని తీర్మానంపై చర్చ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. సభలో ఉన్న శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడంతో ఏకగ్రీవంగా పాస్ అయింది. రూ.25 కోట్ల చొప్పున ఎరచూపి 10 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఆప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.