అమృత్సర్: పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న ఓ డ్రోన్ను గుర్తించారు. దీంతో దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. దానిని మూడు ప్యాకెట్లలో ఉన్న 7.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
దీంతోపాటు ఓ పిస్తోల్, రెండు మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9 ఎంఎం బుల్లెట్లను సీజ్ చేశారు. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశామని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ కన్సైన్ మెంట్ను ఎవరికి చేరవేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఏడాది 17 పాక్ డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు.