చెన్నై, జూలై 12: సమగ్ర విధానాన్ని అనుసరించి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ర్టాలను కేంద్రం శిక్షిస్తున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచడం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు అ న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
చెన్నైలో బుధవారం ఆయ న మాట్లాడుతూ జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ర్టాలు ఈ విధా నం వల్ల లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. ఉత్తరాదిలో భారీగా లోక్సభ సీట్లు పెరుగుతాయని తెలిపారు. బీజేపీకి ఓటు వేయని దక్షిణాదిపై ఆ పార్టీ ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నదని పేర్కొన్నారు.