బెంగళూరు, ఏప్రిల్ 2: పునర్వినియోగ రాకెట్ను ఆవిష్కరించాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీఎల్ఈఎక్స్) పరీక్ష విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ప్రకటించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్) నుంచి చినూక్ హెలికాప్టర్ ద్వారా ఆర్ఎల్వీని సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టగా, టెస్టు రేంజ్లోని రన్వేపై అది సురక్షితంగా దిగిందని ఇస్రో అధికారులు తెలిపారు.
ఈ పరీక్షను ఆదివారం ఉదయం 7.10 గంటల నుంచి 7.40 గంటల వరకు నిర్వహించారు. ఉపగ్రహాలను, వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన తర్వాత రాకెట్లు తిరిగి సురక్షితంగా, స్వీయ నియంత్రణతో భూమికి చేరే సాంకేతికతను అందిపుచ్చుకొనేందుకు ఇస్రో కొన్నాళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నది.