పుదుచ్చేరి, అక్టోబర్ 9: పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై అన్నాడీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఓపెన్ హౌస్’ సెషన్ అంటూ ప్రజల నుంచి పిటిషన్ల స్వీకరణ పేరుతో పుదుచ్చేరిలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించింది.
పుదుచ్చేరి ఈస్ట్ వింగ్ అన్నాడీఎంకే కన్వీనర్ ఏ అంబాళగన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ తమిళిసై నిర్వహిస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నదని అన్నారు. గతంలో కూడా సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వంతో అప్పటి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్బేడీ విభేదాలు పెట్టుకొని పిటిషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు.