బెంగుళూరు: ఇస్రో కొత్త ఏడాదికి సిద్దమైంది. ఫిబ్రవరి 14వ తేదీన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ద్వారా ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 5.59 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనున్నది. 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి.. 1710 కిలోల బరువున్న శాటిలైట్ను పంపనున్నారు. ఈఓఎస్-04తో పాటు సీ52 రాకెట్ మరో రెండు చిన్న ఉపగ్రహాలను తీసుకువెళ్లనున్నది. స్టూడెంట్ శాటిలైట్ ఎన్స్పైర్సాట్-1, టెక్నాలజీ శాటిలైట్ ఐఎన్ఎస్-2టీడీలను ప్రయోగిస్తారు. ఇన్స్పైర్ శాటిలైట్ను ఐఐఎస్టీ, కొలరాడో స్పేస్ ఫిజిక్స్ వర్సిటీలు సంయుక్తంగా డెవలప్ చేశాయి. ఇక ఇండో భూటాన్ జాయింట్ శాటిలైట్ ప్రోగ్రామ్లో భాగంగా ఐఎన్ఎస్-2టీడీని పంననున్నారు. EOS-04.. ఇదో రేడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఎటువంటి వాతావరణంలోనైనా ఇది హైక్వాలిటీ ఇమేజ్లను పంపిస్తుంది. దీన్ని వ్యవసాయం, అటవీ, మొక్కల పెంపకం, నేల సాంద్రత, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ లాంటి అప్లికేషన్లకు ఈ శాటిలైట్ను వాడనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 4.29 నిమిషాలకు శాటిలైట్ ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలవుతుంది.