అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు యూటర్న్ తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆ దంపతులు ప్రకటించారు. తాము మాతోశ్రీ వైపు వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఎంపీ నవనీత్ రాణా దంపతులు శనివారం విలేకరుల సమావేశం పెట్టి, ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
తాము కపట హనుమాన్ భక్తులపై నిరసన తెలుపాలని అనుకున్నామని పేర్కొన్నారు. అయితే వారు తమ ఇంటి పైకి గుండాలను పంపారని, దీని ద్వారా వారి వాస్తవ రూపం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలకు వాస్తవ రూపం తెలిసి కాబట్టి, మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వారు వెల్లడించారు. దీంతో పాటు ప్రధాని మోదీ ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారని, ఈ కారణంగా కూడా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని నవనీత్ రాణా పేర్కొన్నారు.