జమ్ము: జమ్ముకశ్మీర్లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కీలక నేత దేవేందర్ సింగ్ రాణా మాజీ మంత్రి ఎస్ఎస్ స్లాతియాతో కలిసి పార్టీని వీడగా.. తాజాగా ఆయన సన్నిహితుడు ప్రేమ్ సాగర్ అజీజ్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్కు గుడ్బై చెప్పారు. మంగళవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రేమ్ సాగర్ అజీజ్.. దేవేందర్ రాణాకు తన మద్దతు ప్రకటించారు.
కాగా, ఈ నెల 10న నేషనల్ కాన్ఫరెన్స్కు రాజీనామా చేసిన దేవేందర్ రాణా ఆ మరుసటి రోజే బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేమ్సాగర్ అజీజ్ ఎన్సీని వీడారు. తాను ఏకంగా 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, ఆ తర్వాత జమ్ముకశ్మీర్ ప్రయోజనం కోసం దేవేందర్ రాణా మాటమీద నేషనల్ కాన్ఫరెన్స్లో చేరానని అజీజ్ తెలిపారు. ఇప్పుడు రాణా పార్టీని వీడి బీజేపీలో చేరడంతో తాను కూడా పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. తన మద్దతు రాణాకే అని చెప్పారు.