న్యూఢిల్లీ: ప్రముఖ కేరళ కవి ప్రభ వర్మకు ‘సరస్వతి సమ్మాన్, 2023’ పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవలకు ఈ గౌరవం దక్కినట్లు కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారంగా దీనిని పరిగణిస్తారు. ఈ పురస్కారాన్ని 1991లో ఏర్పాటు చేశారు. మలయాళంలో రచించిన ‘రౌద్ర సాత్వికం’ నవల 2022లో ప్రచురితమైంది.