లండన్ : బ్రిటన్ ప్రిన్స్ విలియం ఓ ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణ హితమైన బర్గర్లను సర్వ్ చేసి భోజనప్రియులను ఆశ్చర్యానికి లోను చేశారు. వార్షిక ఎర్త్షాట్ ప్రైజ్ విజేతల పనిని హైలైట్ చేసేందుకు ప్రిన్స్ ఎర్త్షాట్ బర్గర్లను సర్వ్ చేసిన వీడియోను (Viral Video) విడుదల చేశారు. పర్యావరణానికి మేలు చేసే కిచెన్ గాడ్జెట్లు, రెసిపీలను షేర్ చేసే సార్టెడ్ ఫుడ్ యూట్యూబ్ చానెల్ ఫౌండర్లతో కలిసి విలియం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్లాస్టిక్ వాడకుండా నోప్లా అనే కంపెనీ తయారు చేసిన బాక్సుల్లో బర్గర్స్ను పంపిణీ చేశారు. బర్గర్ వ్యాన్ వద్ద చేరిన కస్టమర్లతో ప్రిన్స్ ముచ్చటించారు. బర్గర్లో వాడిన పదార్ధాల్లో కొన్నింటిని భారత్లో తయారైనవి వాడటం విశేషం.
ఖేతి అనే కంపెనీ బర్గర్లో వాడిన పదార్ధాలను భారత్లో గ్రీన్హౌస్లో పెంచినవని, వాయు కాలుష్యాన్ని తగ్గించే కాన్సెప్ట్తో కీన్యా మహిళ డిజైన్ చేసిన ముకురు క్లీన్ స్టవ్స్లో వీటిని కుక్ చేశామని ప్రిన్స్ విలియం కస్టమర్లకు తెలిపారు. అయితే బర్గర్ల రుచి, నాణ్యత గురించి తాను హామీ ఇవ్వలేనని అయితే వాటితో తన ప్రయాణం సాగుతోందని చెప్పుకొచ్చారు.
Read More :
Virat Kohli | కోహ్లీకి బ్రేస్లెట్ గిప్ట్గా ఇచ్చిన చిన్నారి.. వీడియో వైరల్