సూరత్ : ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్ను(Surat Diamond Bourse) ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అంతర్జాతీయ డైమండ్, జ్యూవెలరీ వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద, ఆధునిక కేంద్రంగా సూరత్ డైమండ్ బోర్స్ వెలుగొందనుంది.
ఆభరణాలు, ముడి, పాలిష్డ్ వజ్రాల వ్యాపారానికి ఇది గ్లోబల్ సెంటర్ కానుందని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఓ ప్రకటనలో పేర్కొంది. రూ. 3500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 4500 డైమండ్ వ్యాపార కార్యాలయాలకు ఈ కేంద్రం వేదిక కానుంది.
సూరత్ డైమండ్ బోర్స్ నిర్మాణం 2015 ఫిబ్రవరిలో ప్రారంభం కాగా 2022లో పూర్తయింది. ఈ ఏడాది ఆగస్ట్లో ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.
Read More :