ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్పై ఉదయం నుంచీ బాంబులతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రష్యా ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. క్రూడ్ ఆయిల్ ధరలు, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపైనే ఈ సమావేశం ప్రధానంగా చర్చించనుంది. అలాగే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది.