National
- Dec 31, 2020 , 01:53:33
ఫోన్ టవర్ల విధ్వంసాన్ని అడ్డుకోండి

పంజాబ్ సీఎంకు రిలయన్స్ జియో లేఖ
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రైతుల నిరసనల నేపథ్యంలో తమ టెలిఫోన్ టవర్లు విధ్వంసానికి గురవుతుండటంపై రిలయన్స్ జియో సంస్థ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు లేఖ రాసింది. అన్నదాతల ముసుగులో టవర్లను ధ్వంసం చేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నష్టం చేకూరుస్తుండటంతో రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీలే ఎక్కువ లబ్ధిపొందుతున్నారని విశ్వసిస్తున్న రైతులు.. ఇందులో భాగంగానే అంబానీకి చెందిన టెలికం టవర్లపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, టవర్ల ధ్వంసంపై అసోచామ్ కూడా సీఎంకు లేఖ రాసింది.
తాజావార్తలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
MOST READ
TRENDING