న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇవాళ పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల ప్రదానం అనంతరం పద్మ అవార్డీలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి గ్రూప్ ఫొటో దిగారు.
కాగా, ఈసారి మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 10 మందికి పద్మభూషణ్ పురస్కారాలు, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. అవార్డీల్లో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. మరో 16 మందికి మరణానంతరం పద్మ అవార్డులు దక్కాయి.