న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు ప్రముఖులకు అల్పాహార విందు ఇచ్చారు. ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆయన ఇచ్చిన విందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు.
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన అల్ఫాహార విందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఆయన సతీమణి శివమాల, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి @ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి @ హోం కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వాగతం పలికారు.