న్యూఢిల్లీ: వాటికన్ సిటీకి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) బయలుదేరి వెళ్లారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొనున్నారు. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్లారు. వాటికన్ వెళ్తున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోష/వఆ పీటర్ డిసౌజా ఉన్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ముతో పాటు మంత్రులు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు.
ఏప్రిల్ 21వ తేదీన వాటికన్లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో కన్నుమూసిన విషయం తెలిసిందే. 2013, మార్చి 13వ తేదీన ఆయన పోప్ బెనడిక్ట్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ 25వ తేదీన వాటికన్లోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్కు ముర్ము నివాళి అర్పిస్తారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో విదేశీ నేతలు కూడా పాల్గొంటారు.
ఏప్రిల్ 26వ తేదీన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్భంగా ఆ రోజును సంతాప దినంగా పాటించనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
President Droupadi Murmu departs for Vatican City to attend the State Funeral of HH Pope Francis. She is accompanied by Union Minister for Parliamentary Affairs and Minority Affairs, Shri Kiren Rijiju; Minister of State for Minority Affairs and Fisheries, Animal Husbandry and… pic.twitter.com/yCoZh8s0nq
— President of India (@rashtrapatibhvn) April 25, 2025