న్యూఢిల్లీ : ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల్లో తాజా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆయా రాష్ర్టాల ఎన్నికల అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీలకు ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని ఈసీ ఆదేశించింది. డిసెంబర్ 17తో మిజోరాం అసెంబ్లీ గడువు ముగుస్తుండగా, వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు ముగియనున్నది.