భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడు చనిపోయిన బెడ్ను గర్భిణీ అయిన భార్యతో శుభ్రం చేయించారు. (Woman Made to Clean Hospital Be) దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఆదివాసీలు అధికంగా ఉండే లాల్పూర్ గ్రామంలో నెలకొన్న భూ వివాదంపై గురువారం ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తి, అతడి ముగ్గురు కుమారులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. తండ్రి, ఒక కుమారుడు సంఘటనా స్థలంలోనే మరణించారు. కాల్పుల్లో గాయపడిన మరో ఇద్దరు కుమారులైన శివరాజ్, రాంరాజ్ను గడసరాయ్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజ్ మరణించాడు. అయితే ఆ బెడ్పై రక్తం ధారగా కారింది. ఈ నేపథ్యంలో ఐదు నెలల గర్భిణీ అయిన మృతుడి భార్య రోష్నీతో ఆ బెడ్ను శుభ్రం చేయించారు. బెడ్కు అంటుకున్న రక్తాన్ని గుడ్డతో తుడిపించారు. ఆ తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేయించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ స్పందించారు. ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. భర్త మరణించిన బెడ్ను క్లీన్ చేయాలని మృతుడి భార్యకు ఎవరూ చెప్పలేదన్నారు. కాల్పుల్లో భర్త మరణించిన నేపథ్యంలో సాక్ష్యం కోసం రక్తాన్ని గుడ్డతో తుడవడానికి ఆమే అనుమతి కోరిందని తెలిపారు. ఈ సంఘటన గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
At Gadasarai Health Centre in Dindori, MP a five months old pregnant woman Roshini was asked to clean the hospital bed on which her husband Shivraj died. This is how patients and their family members get treated in our Govt Hospitals.pic.twitter.com/yZsnDYV4jz
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 2, 2024