న్యూఢిల్లీ : భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై కాలు మోపనుంది. జులై 14న శ్రీహరికోట నుంచి నింగికెగిసిన స్పేస్క్రాఫ్ట్ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా 70 డిగ్రీల అక్షాంశం దగ్గర అడుగుపెట్టనుంది.
చంద్రయాన్-3 మిషన్ సేఫ్ ల్యాండింగ్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుతూ ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని రిషీకేష్లో చంద్రయాన్-3 సక్సెస్ను కాంక్షిస్తూ త్రివర్ణ పతాకాలు చేబూని గంగా నదికి హారతి ఇచ్చారు.
చంద్రయాన్ సక్సెస్తో ఇస్రో ఘనకీర్తి ప్రపంచం నలుదిశలా చాటాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ సేఫ్ ల్యాండింగ్ను విద్యార్ధులు వీక్షించేందుకు పాఠశాలలు, విద్యాసంస్ధల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More :