ముంబై : మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత (అజిత్ పవార్ వర్గం) ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎం పదవి ఖాళీ లేదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో దీర్ఘకాలం తమ పార్టీని ముందుండి నడిపిస్తూ అజిత్ పవార్ (Ajit Pawar) ప్రముఖ నేతగా ఎదిగారని అన్నారు.
రాబోయే రోజుల్లో అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారని, ఈ దిశగా తాము సరైన వ్యూహంతో ముందుకెళుతున్నామని చెప్పారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారధ్యంలోని బీజేపీ-శివసేన సర్కార్కు అజిత్ పవార్ వర్గం అనూహ్యంగా మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.
శరద్ పవార్తో విభేదిస్తూ పెద్దసంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలతో ఫిరాయించిన అజిత్ పవార్ షిండే సర్కార్కు మద్దతు పలికారు. దీంతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, పార్టీ ఫిరాయించిన రెబెల్ ఎమ్మెల్యేలకు షిండే కొలువులో మంత్రి పదవులు లభించాయి.