న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారతదేశ నిర్మాణంలో మాజీ ప్రధానుల భాగస్వామ్యం, వారి వ్యక్తిగత వివరాల సమాచారం అందించే ‘ప్రధానమంత్రి సంగ్రహాలయా’ మ్యూజియాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో ప్రారంభించారు. మ్యూజియం మొట్టమొదటి టికెట్ను మోదీనే కొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మనందరి బాధ్యత’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ప్రజాస్వామ్యం వైపు బలమైన అడుగులు పడ్డాయన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాస్వామ్య భారత నిర్మాణంలో ప్రతీ ప్రధాని తన వంతు సహకారం అందించారని పేర్కొన్నారు.