న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ‘ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ సెటైర్లు వేశారు. 2014లో యూపీఏ పాలనలో బైక్లు, కార్లు, ట్రాక్టర్, టక్కుల్లో ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపేందుకు ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత మేరకు ధరలు పెరిగాయో పేర్కొంటూ ట్వీట్ చేశారు.
మోదీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఉదయం ఉత్సాహం కంటే.. ద్రవ్యోల్బణం బాధ కలిగిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. రెండువారాల్లో పెట్రోల్, డీజిల్ రూ.8.40 వరకు పెరిగిందని, సీఎన్జీ కేజీకి రూ.2.50 పెరిగిందంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 40 చొప్పున పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కి పెరిగింది. దాదాపు ఐదు నెలల తర్వాత దేశంలో మార్చి 22న పెట్రోల్ ధరలు పెరిగాయి. గడిచిన రెండువారాల్లో ఇంధన ధరలు ఇప్పటి వరకు 12సార్లు పెరిగాయి.
Pradhan Mantri Jan Dhan LOOT Yojana pic.twitter.com/OQPiV4wXTq
— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2022