భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ పోస్టుమాస్టర్ తన పోస్టాఫీసు కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును దుర్వినియోగం చేశాడు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ డబ్బును వాడినట్లు తెలుస్తోంది. 24 కుటుంబాలకు చెందిన సుమారు కోటి రూపాయాల ఎఫ్డీలను బెట్టింగ్కు వాడినట్లు విచారణలో వెల్లడైంది. సాగర్ జిల్లాలోని సబ్ పోస్టాఫీసులో ఈ ఘటన జరిగింది. బీనా సబ్ పోస్టాఫీసు పోస్టుమాస్టర్ విశాల్ అహిర్వార్ను అరెస్టు చేశౄరు. మే 20వ తేదీన అతన్ని బీనా గవర్నమెంట్ రైల్వే పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆ నేరానికి పాల్పడినట్లు అతను అంగీకరించాడు. కస్టమర్లకు నిజమైన పాస్బుక్లను జారీ చేసి.. నకిలీ ఎఫ్డీ అకౌంట్లు జారీ చేసినట్లు పోస్టుమాస్టర్పై ఆరోపణలు ఉన్నాయి. గడిచిన రెండేళ్ల నుంచి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆ సొమ్మును వాడుతున్నట్లు గుర్తించారు. ఐపీసీలోని 420 చీటింగ్, 408 నమ్మకద్రోహం కేసులను రిజిస్టర్ చేశారు.