హైదరాబాద్ :మహమ్మారి అత్యంత ప్రభావితం చేసిన రంగాల్లో పర్యాటక రంగం కూడా ఉండగా దాదాపు రెండేళ్ల తర్వాత కాస్త కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు పరిమితంగా తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశీయంగా కరోనా పరిమితుల సడలింపులతో భారతీయ పర్యాటక కేంద్రాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. పర్యాటక రంగం పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. కొవిడ్-19 అనంతర కాలంలో ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన పరిస్థితులను అంచనా వేయడం ఇప్పటికీ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, పర్యాటకరంగానికి చెందిన నిపుణులు టూర్ కి వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలిపారు.
ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న పరస్థితుల్లో, ప్రజలు తమ పర్యాటక సంబంధిత కోర్కెలను నెరవేర్చుకునేందుకు బడ్జెట్కు అనుకూలమైన ఆఫర్లను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రయాణికులు ఇంటి నుంచి పని ఒత్తిడిని ఎదురక్కొనేందుకు, సౌకర్యవంతమైన తక్కువ ప్రయాణ దూరాలకు, సులభంగా బుక్ చేసుకుకోవడంతోపాటు, విలాసవంతమైన హాలిడేస్ తదితర ఆచరణాత్మక సెలవులను కోరుకుంటున్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఎ ప్రకారం, తక్కువ పరిమితులు, వేగవంతమైన టీకా ప్రక్రియ విధానం, జర్నీ డిమాండ్తో పర్యాటక రంగం ఊహించిన దాని కన్నా వేగంగా అభివృద్ధి చెందింది, దీని ఫలితంగా ‘రివెంజ్ ట్రావెల్’ పరిస్థితులు నెలకొన్నాయి.
పర్యటన విషయంలో…
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలకు సంబంధించిన నిషేధాజ్ఞలతో అంతర్జాతీయ ప్రయాణం నిలిచి పోయింది. పలు దేశాలు ఇప్పటికీ పర్యాటకుల కోసం తమ సరిహద్దులను తెరవలేదు. పెరిగిపోతున్న టిక్కెట్ ధరలు, హోటల్ రేట్లతో దేశీయ, స్వల్ప-దూర ప్రయాణాలు ప్రయాణికులకు మరింత ఆకర్షణీయంగా మారిపోతున్నాయి. ప్రయాణికులు ఆనందం లేదా వ్యాపారం కోసం ప్రయాణిస్తున్నా, ఇప్పుడు దేశీయ పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అత్యున్నత స్థాయి భద్రత, పరిశుభ్రతను నిర్ధారించేందుకు దేశాల మధ్య నిబంధనలనూ నివారించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా దేశీయ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ట్రావెల్ , హాస్పిటాలిటీ కంపెనీలు తమ ప్రయాణ పాలసీలలో ప్రోత్సాహకాలు,బీమా అవకాశాలు కల్పించడం సత్ఫలితాలు ఇవ్వనున్నాయి.
కొనసాగుతున్న కొవిడ్-19 మహమ్మారి నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం అనుకూలత, పొదుపు. ఇది పర్యాటక రంగాన్ని సరిగ్గా సరిపోతుందని వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలప్పిల్లి అన్నారు. సామాజిక ఐసోలేషన్ ద్వారా కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలి. యాత్రికులు బహిరంగ ప్రదేశాలు, బీచ్లు, అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణుల రిజర్వులు, భౌతిక దూరాన్ని సులభంగా పాటించే ఇతర ప్రదేశాలను ఎంచుకునేందుకు అవకాశం ఉంది. ఫలితంగా, దాదాపు 70శాతంనేచర్ క్యాంప్లు, హైకింగ్ ట్రైల్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, నేషనల్ పార్క్లు, బీచ్లు పర్యాటకుల కోసం తిరిగి ప్రారంభమైనప్పటికీ, మ్యూజియాలు,హెరిటేజ్ సైట్లు తదితర ఇండోర్ స్పేసెస్లు 50శాతం మాత్రమే ఉన్నాయి.
ఎక్కువ కాలంగా ఇంటి నుంచి పని చేసే మార్పు నుంచి తప్పించుకోవాలనుకునే వ్యక్తుల కోసం, ఈ న్యూ-ఏజ్ హాస్పిటాలిటీ ప్లేయర్లు హై-స్పీడ్ ఇంటర్నెట్ ,డెడికేటెడ్ వర్క్స్పేస్లతో బస లేదా వర్కింగ్ హాలిడే ఆప్షన్లను కూడా అందిస్తున్నారు. ఈ న్యూ నార్మల్లో, తెరపైకి వచ్చిన గెస్ట్ సర్వీస్ పోకడ, కొత్త మోడళ్లకు దారితీస్తుందని అంచనా వేయబడగా, ఇది పనిలో ఇతర ప్రదేశాలలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండనుందని వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలప్పిల్లి అన్నారు.
రిగ్యులర్ లైఫ్ ఒదిగి పోయేందుకు కొన్ని దేశాలు ఇప్పటికే ఆటోమేషన్, అనలిటిక్స్ని అమలు చేయడాన్ని ప్రారంభించగా, చాలా ఎక్కువగా న్యూ-ఏజ్ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, ఖర్చులను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.ప్రస్తుత ఆర్థిక మందగమనం లీజర్ ట్రావెల్ భవిష్యత్తును ఊహించే అవకాశాన్ని అందిస్తుంది. పర్యాటకం ఒక కూడలిలో ఉండగా, నేడు జర్నీలో ఉన్న నిబంధనలు భవిష్యత్తులో పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందో నిర్ణయించనుంది. టూరిజం ఆర్థిక వ్యవస్థ వైరస్తో సహజీవనం చేయడాన్ని అనుమతించేందుకు స్వల్పకాలం నుంచి మధ్యస్థ కాలానికి అనువైన విధాన పరిష్కారాలు అవసరం కాగా, దీనికి మించి చూడటం,సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరమూ ఉంది.