DGCA : మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. ల్యాండింగ్ సమయంలో రన్వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నది.
మొదటిసారి రన్వేపై విమానం ల్యాండింగ్కు పైలట్ ప్రయత్నించారని, కానీ సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టారని డీజీసీఏ తెలిపింది. రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించడాన్ని బట్టి రన్వే సరిగ్గా కనిపించలేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నది. ల్యాండింగ్ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ విషయం వెల్లడించింది.
కాగా మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు మరో నలుగురు మృతిచెందారు.