Poonch terror attack | శ్రీనగర్ : ఫూంచ్ ఉగ్రదాడికి తామే బాధ్యులమని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) సంస్థకు చెందిన ఉగ్రవాదులు ప్రకటించారు. ఆర్మీ ట్రక్కుల్లో వెళ్తున్న జవాన్లపై ఎం4 కార్బైన్ రైఫిల్స్తో కాల్పులు జరిపినట్లు ఉగ్రవాదులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ చిత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఎం4 కార్బైన్ను యూఎస్లో అత్యాధునికంగా తయారు చేశారు.
ఎం4 కార్బైన్ అనేది 1980లో అమెరికాలో అభివృద్ధి చేశారు. ఇది తేలికపాటిగా ఉంటుంది. గ్యాస్-ఆపరేటెడ్, మ్యాగజైన్-ఫెడ్ కార్బైన్ కూడా ఇది. ఎం4 కార్బైన్తో తక్కువ కాలంలో ఎక్కువ రౌండ్ల కాల్పులు జరిపే అవకాశం ఉంటుంది. ఈ తుపాకీని యుద్ధాల్లో, కీలకమైన వ్యక్తులకు రక్షణగా ఉపయోగిస్తారు.
కాశ్మీర్లో ఉగ్రవాదులు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2016 నుంచి ఇప్పటి వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదుల నుంచి నాలుగు ఎం4 రైఫిళ్లతో పాటు స్టీల్ బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్టీల్ బుల్లెట్లు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. ఈ బుల్లెట్లు వాహనాల్లోకి ఈజీగా చొచ్చుకుపోతాయి.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐసీస్చే స్థాపించబడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరును మార్చుకుందని భద్రతా సంస్థలను అనుమానిస్తున్నాయి. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) గా పేరు మార్చుకున్నట్లు అనుమానిస్తోంది. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంటున్న ప్రతి ఉగ్రదాడికి తామే బాధ్యులమని పీఏఎఫ్ఎఫ్ ప్రకటిస్తూ వస్తోంది.