జైపూర్: తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపించుకున్నారు. 81 సీట్లలో కొందరు నేతలకు గట్టి పట్టు ఉంది. అందులో 40 సీట్లలో దశాబ్దాల తరబడి కొన్ని కుటుంబాలే అధికారం చెలాయిస్తున్నాయి. ఈసారి రెండు పార్టీల సీనియర్ నేతలు 26 టిక్కెట్లను తమ వారసులు, బంధువులకు కేటాయించారు. ఇలా బీజేపీలో 11, కాంగ్రెస్లో 15 మంది టికెట్లు పొందారు.