బెంగళూరు : జాతీయ గీతం ‘జనగణమన’ను బ్రిటిష్ అధికారికి స్వాగతం పలకడానికి రాశారని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘వందేమాతరం’ గేయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ‘జనగణమన’తో సమానంగా పరిగణించాలని విశ్వేశ్వర్ అన్నారు.
‘వందే మాతరం’ గేయం 150 సంవత్సరాల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకోవడంలో భాగంగా హోన్నవార్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటుగా స్పందించారు. ఇదంతా ‘అట్టర్ నాన్సెన్స్’, ఆరెస్సెస్ వాట్సాప్ చరిత్ర పాఠమని విమర్శించారు.