తిరువనంతపురం: నిండు గర్భిణీ అయిన మహిళ ఇంట్లో ఒక బిడ్డను ప్రసవించింది. అయితే ఆ నవజాత శిశువు ( Newborn Abandoned) ను బాత్రూమ్లోని బకెట్లో వదిలేసింది. ఆ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బందికి ఈ విషయం చెప్పింది. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటికి వెళ్లారు. బాత్రూమ్లోని బకెట్లో వదిలేసిన ఆ బిడ్డను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చెంగనూర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ నిండు గర్భిణీ. మంగళవారం ఇంట్లోనే బిడ్డను కన్నది. అనంతరం అప్పుడే పుట్టిన శిశువును బాత్రూమ్లోని బకెట్లో ఉంచింది. ఆ బిడ్డను ఆ బకెట్లో వదిలేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. తాను బిడ్డను ప్రసవించానని, ఇంట్లోని బకెట్లో ఆ శిశువును వదిలేసినట్లు వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పందించారు. వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్లారు. బాత్రూమ్లోని బకెట్లో వదిలేసిన బిడ్డను రక్షించారు. తల్లి ఉన్న ఆసుపత్రికి ఆ నవజాత శిశువును తరలించారు. అయితే పుట్టిన బిడ్డను ఆమె ఎందుకు బాత్రూమ్లోని బకెట్లో వదిలేసిందో అన్నది తెలియలేదు. దీని గురించి ఆ మహిళను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: