రాంచీ: ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలో దూకి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వీరి పన్నాగాలను పసిగట్టిన పోలీసులు వెంటాడి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8,29,600 నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్ కార్డులు, 12 పాస్ పుస్తకాలు, ఆరు చెక్ బుక్లు, నాలుగు పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గిరిధ్ సీనియర్ పోలీసు అధికారి చెప్పిన వివరాల ప్రకారం, ఈ నిందితులు నగ్న వీడియో కాల్స్ చేసి, బాధితులను బ్లాక్మెయిల్ చేసేవారు. ప్రసూతి ప్రయోజనాలను అందజేస్తామని ఓ న్యూట్రిషన్ ట్రాకర్ యాప్ ద్వారా గర్భిణులను మోసం చేసేవారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందం మఫ్టీలో వెళ్లింది. బారాకర్ నది ఒడ్డున పోలీసులను నిందితులు గుర్తుపట్టారు. వెంటనే నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసుల వారిని పట్టుకున్నారు.