న్యూఢిల్లీ: సాధారణంగా డబ్బులు, నగలు కోసం చోరీలు జరుగుతుంటాయి. అయితే ఒక వ్యక్తి ఏకంగా టూత్పేస్ట్లను చోరీ చేశాడు. చివరకు ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట లాహోరీ గేట్ ప్రాంతంలోని గోడౌన్ నుంచి 215 బాక్సుల టూత్పేస్ట్ మాయమైంది. దీంతో వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు. కనిపించకుండా పోయిన గోడౌన్ మేనేజర్ ఉదయ్ కుమార్ అలియాస్ సంతోష్పై అతడు అనుమానం వ్యక్తం చేశాడు.
కాగా, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. టూత్పేస్ట్ల దొంగ ఉత్తరప్రదేశ్లోని ఖాసేపూర్ బహ్రంపూర్ గ్రామంలో ఉన్నట్లు వారికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడకు వెళ్లారు. ఆ సాయంత్రం వేళ స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడు సంతోష్ ఇంటిపై రైడ్ చేశారు. ఇంట్లో వెతకగా టూత్పేస్ట్ బాక్సులు కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.