న్యూఢిల్లీ: వివిధ కంపెనీలు, వ్యక్తుల ఖాతాలు నిర్వహించే సీఏలపై సైతం కేంద్రం ఆంక్షలు ప్రారంభమయ్యాయి. వారిని పీఎంఎల్ఏ పరిధిలోకి తెస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. సీఏ, సీఎస్, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్లు నిర్వహించే ప్రతి లావాదేవి కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) పరిధిలోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది.
హవాలా నిరోధక చట్టంలోని పలు సెక్షన్లు వర్తిస్తాయని తెలిపింది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం, క్లయింట్ నగదు నిర్వహణ, సెక్యూరిటీలు, ఆస్తుల నిర్వహణ, సేవింగ్స్ తదితరమైనవన్నీ పీఎంఎల్ఏ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.