న్యూఢిల్లీ : కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాననమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద పదో విడుత నిధులను జనవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తారని ప్రధాని కార్యాలయం (PMO) బుధవారం తెలిపింది. రూ.10కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్లకుపైగా నగదు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.
పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రైతులకు సంవత్సరానికి రూ.6వేల చొప్పున నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పథకం కింద ఇప్పటి వరకు రూ.1.6లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కార్యక్రమంలోనే ప్రధాని సుమారు 351 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (FPOs) రూ.14 కోట్లకుపైగా ఈక్విటీ గ్రాంట్ను కూడా విడుదల చేస్తారని పీఎంఓ పేర్కొంది.