PM Narendra Modi : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(BR Gavai)పై షూ దాడిని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఖండించారు. భారత సీజేఐపై దాడికి యత్నించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సీజేఐతో మాట్లాడారు. అనంతరం మన సమాజంలో ఇలాంటి అనైతికమైన చర్యలకు తావు లేదని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్తో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. ఇలాంటి అనైతికమైన.. ఆమోదయోగ్యంకాని చర్యలకు మన సమాజంలో చోటు లేదు. సీజేఐపై దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని మోడీ తన ట్వీట్లో వెల్లడించారు.
Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable.
I appreciated the calm displayed by Justice…
— Narendra Modi (@narendramodi) October 6, 2025
సుప్రీంకోర్టు ఆవరణలో సోమవారం ఉదయం ఒక కేసు విచారణ సమయలో 72 ఏళ్ల లాయర్ రాకేశ్ కిశోర్(Rakesh Kishore) సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఆయనను గమనించిన తోటి లాయర్లు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్తుండగా సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని భారత్ సహించదు అని గట్టిగా అరిచారు. అయితే.. తనపై దాడి ప్రయత్నం జరిగినా అదేమీ పట్టదన్నట్టుగా తన పనిలో తాను నిమగ్నమయ్యారు సీజేఐ.
యథావిధిగా కేసు విచారణ కొనసాగించాలని ఆయన లాయర్లను కోరారు. ఇలాంటి ఘటనలతో నేను డిస్ట్రబ్ కాను. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయలేవు. మీరు వాదనలు వినిపించండి అని గవాయ్ అన్నారు. ఇటీవలి మధ్యప్రదేలో విష్ణువు విగ్రహం పునఃస్థాపన గురించిన కేసు వాదన సమయంలో.. మీరు మీ దేవుడినే అడగండి అని గవాయ్ వ్యాఖ్యానించారు. దాంతో, ఆయన సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారని పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే లాయర్ రాకేశ్ సీజేఐపై చెప్పుతో దాడికి యత్నించారు.