న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ యూఏఈ, కువైట్ పర్యటనలపై ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బపడింది. ప్రస్తుతం భారత్ సహా అన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటంతో ప్రధాని పర్యటన వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6న ప్రధాని యూఏఈకి వెళ్లాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వాయిదాపడిన ప్రధాని పర్యటన.. ఒమిక్రాన్ అదుపులోకి వస్తే ఫిబ్రవరిలో రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉన్నది.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచమంతా శరవేగంగా విస్తరిస్తున్నది. అమెరికా, యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నది. అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులను ఒమిక్రాన్ వేరియంట్ డామినేట్ చేసింది. ఒమిక్రాన్ వేగం కారణంగా యూకేలో రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. భారత్లో మాత్రం నవంబర్ 24 తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 800కు చేరింది.