బెంగళూరు : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న కర్నాటక మైసూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కరనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద దేశవ్యాప్తంగా 75 ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు.
మైసూర్లో జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు విదేశాల్లోని భారతీయ మిషన్లు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తాయన్నారు. ప్రణాళిక ప్రకారం.. జపాన్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమై.. న్యూజిలాండ్లో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో 70 దేశాలు పాల్గొనే అవకాశం ఉందని, యోగా దినోత్సవం రోజు జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొంటారన్నారు.