జమ్మూ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. శీతాకాల రాజధాని జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సుమారు 30 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. విద్య, రైల్వే, ఏవియేషన్, రోడ్డు మార్గాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నారు.
కొత్తగా రిక్రూట్ అయిన 1500 మందికి ఆయన అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వనున్నారు. నగరంలోని పలు ఆలయాలను ఆయన విజిట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో బహుళ స్థాయిలో సెక్యూర్టీని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రో లైట్ విమానాలను నిషేధించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 359 మీటర్ల ఎత్తులో ఆ బ్రిడ్జ్ను నిర్మించారు. అది ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్ల ఎత్తులో ఉంది.
The inauguration of the world’s highest rail bridge,the Chenab Bridge, by PM Modi in Jammu & Kashmir on 20th Feb is a significant milestone. Standing at 359m, it surpasses the height of the Eiffel Tower by 35m.
Major infrastructural advancement in J&K post abrogation of Art 370 pic.twitter.com/ijK9uLIe6Z
— Fatima Dar (@FatimaDar_jk) February 18, 2024