ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించనున్నట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్తో మాట్లాడటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు గంట గంటకూ మారిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సంభాషించనున్నారన్న వార్త ప్రపంచ రాజకీయాల్లో కీలకాంశం.
ఉక్రెయిన్ విషయంలో ప్రపంచ దేశాలు మాట్లాడకూడదని, జోక్యం చేసుకోకూడదని పుతిన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ పుతిన్తో ఏం మాట్లాడుతారని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్పై రష్యా ప్రకటించిన యుద్ధాన్ని ఆపడానికి భారత్ జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా కోరిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సంభాషించనున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్పై రష్యా ప్రకటించిన యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో తాము భారత క్రియాశీల మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ మాట్లాడాలని ఇగోర్ పోలిఖా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.