న్యూఢిల్లీ : అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో కూడిన త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ కానున్నారు. త్రివిధ దళాధిపతులు ప్రధానితో వేర్వేరుగా సమావేశమవుతారు. తొలుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్రధానిని కలుస్తారని అధికార వర్గాలు పేర్కొన్నారు.
న్యూ రిక్రూట్మెంట్ పధకం అగ్నిపథ్ కోసం ఇప్పటికే త్రివిధ దళాలు నోటిపికేషన్లను జారీ చేశాయి. మరోవైపు అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్తో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని దీంతో దేశమంతటా అగ్గి రాజుకుందని కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమంటున్నాయి.