Nitin Gadkari | లోక్సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారని శివసేన (యూబీటీ) సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మేరకు శివసేన మౌత్పీస్ సామ్నాలో వ్యాసం రాశారు. నితిన్ గడ్కరీ నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నాగ్పూర్ గడ్కరీ, ఫడ్నవీస్ ఇద్దరికి స్వస్థలం కావడం విశేషం. ఈ కథనంలో నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ఓటమికి మోదీ, షా, ఫడ్నవీస్ పని చేశారని.. ఆయనను ఓడించలేరని తెలుసుకున్న ఫడ్నవీస్.. ఇష్టం లేకపోయినా గడ్కరీ కోసం ప్రచారం చేశారని చేశారన్నారు.
గడ్కరీని ఓడించేందుకు ఫడ్నవీస్ ప్రతిపక్షాల కోసం పని చేశారని.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రతి నియోజకవర్గంలో రూ.25-30 లక్షలు పంపిణీ చేసినట్లు శివసేన థాకరే వర్గం నేత ఆరోపించారు. మోదీ-షా త్రయం మళ్లీ అధికారంలోకి వస్తే యూపీలో సీఎం యోగిని మారుస్తారన్నారు. అయితే, సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే కొట్టిపడేశారు. బీజేపీ ఒక పార్టీ కాదని.. కుటుంబంలాంటిదన్నారు. ఎప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేవారు కుటుంబ బంధాన్ని అర్థం చేసుకోలేరని.. ప్రధాని మోదీ, షా, యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ, ఫడ్నవీస్ అందరూ బీజేపీ కుటుంబంలో భాగమేనన్నారు.