వారణాసి: కాశీలోని విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్న సుమారు వంద మంది సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పాదరక్షకాలను ప్రధాని మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. జనపనారతో తయారు చేసిన వంద జతల పాదరక్షాలను వారికి పంపించారు. వారణాసి నియోజకవర్గానికి చెందిన ప్రధాని మోదీ.. ఇటీవల అక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. విశ్వనాథుడి ఆలయంలో పనిచేస్తున్న పూజారులు, సెక్యూర్టీ గార్డులు, శానిటేషన్ వర్కర్లు ఎవరూ కూడా చప్పులు ధరించారు. లెదర్ కానీ.. రబ్బర్తో కానీ చేసిన పాదరక్షాలను ఆలయ పరిసరాల్లో వాడకూడదు. ఇటీవల పర్యటనలో ఆ విషయాన్ని తెసుకున్న మోదీ.. అక్కడ పనిచేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా జనపనారతో తయారు చేసిన పాదరక్షకాలను వారి కోసం పంపించారు.