న్యూఢిల్లీ : రెట్రో ట్యాక్స్ (వెనుకటి తేదీ నుంచి పన్ను విధించడం)ను తొలగించడంతో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య పరస్పర విశ్వసం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో జరిగిన పొరపాటును సవరిస్తూ రెట్రో ట్యాక్స్కు ప్రభుత్వం ముగింపు పలికిందని బుధవారం సీఐఐ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు.
గత కొన్నేండ్లుగా కేంద్రం చేపడుతున్న సంస్కరణలు అనివార్యంగా కాకుండా చిత్తశుద్ధితో తాము ముందుకెళుతున్నామనేందుకు సంకేతమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ బిల్లు వంటి పలు కీలక సంస్కరణలను చేపట్టామని ఆయన గుర్తుచేశారు. కాగా వొడాఫోన్పై విధించిన రెట్రో ట్యాక్స్ డిమాండ్ కేసులో భారత్కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. తొమ్మిదేండ్ల పాటు అమల్లో ఉన్న రెట్రో ట్యాక్స్కు ముగింపు పలుకుతూ పన్ను చట్టాల సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఇటీవల ఆమోదించాయి.