న్యూఢిల్లీ: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను రిలీజ్ చేశారు. పదో విడతగా విడుదలైన ఈ నిధులను దేశంలోని 10 కోట్ల మంది లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కాగా, పీఎం-కిసాన్ పథకం కింద కేంద్రం అర్హులైన రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో జమచేస్తున్నది.
ఇప్పటివరకు మొత్తం 9 విడతల్లో పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. ఇవాళ పదో విడత నిధులను ప్రధాని రిలీజ్ చేశారు. తొలి తొమ్మిది విడతలకు కలిపి మొత్తం లక్షా అరవై వేల కోట్లను రిలీజ్ చేసినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా ఇవాళ మరో 20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు.