హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం పాలైన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర ఆర్మీ సిబ్బంది భౌతికకాయాలకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆ తర్వాత ఆర్మీ కుటుంబ సభ్యులతో పాలం ఏయిర్పోర్టులో మాట్లాడారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు కూడా వారి భౌతికకాయాలకు నివాళులర్పించారు. రాజ్నాథ్, దోవల్ ఆర్మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వీరందరి మృతదేహాలను తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీలోని పాలం ఏయిర్పోర్టుకు తరలించారు.