గ్లాస్గో : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్కాట్లాండ్లో డ్రమ్స్ వాయించారు. అక్కడ స్థిరపడిన భారతీయులతో మోదీ ముచ్చటించారు. చిన్న పిల్లలను ఆప్యాయంగా పలుకరించి, ఆశీర్వదించారు. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్లో మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మోదీ ఇండియాకు బయల్దేరే ముందు భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికారు.
గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) 26వ సెషన్లో పాల్గొన్న ప్రధాని మోదీ పలు దేశాల మధ్య ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలపై మాట్లాడారు.