తిరువనంతపురం, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో హిందీలోనే బోధన చేపట్టాలనే పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలపై కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు.
ఇంగ్లిష్ను పక్కనపెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒకే భాషను దేశ భాషగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ రాశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రతిపాదనలపై మోదీ స్పందించాలని కోరారు.