న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలుత ఫ్రాన్స్కు వెళ్తున్నారు. కృత్రిమ మేధస్సుపై జరిగే శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఏఐ యాక్షన్ సమ్మిట్లో ఇండియా కోచైర్ పాత్ర పోషించనున్నది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్తో చర్చలు నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే అంశాన్ని చర్చిస్తామన్నారు. మారిసెల్లేలో కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు కూడా ప్రధాని మోదీ చెప్పారు.
Over the next few days, I will be in France and USA to take part in various programmes.
In France, I will be taking part in the AI Action Summit, where India is the co-chair. I will be holding talks with President @EmmanuelMacron towards strengthening India-France relations. We…
— Narendra Modi (@narendramodi) February 10, 2025
ఫ్రాన్స్ తర్వాత అమెరికాలోనూ మోదీ పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. అమెరికా, భారత్ మధ్య స్నేహబంధం మరింత దృఢంకానున్నట్లు ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. తొలిసారి అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ పనిచేసిన సమయంలో ఆయనతో తనకు మంచి రిలేషన్ ఉన్నట్లు మోదీ గుర్తు చేశారు. తమ మధ్య జరిగే సంభాషణ రెండు దేశాల మధ్య రిలేషన్ను పెంచుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.