సంబల్ : ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కీ ధామ్(Kalki Dham) ఆలయానికి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రమోద్ కృష్ణమ్ను కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు వెలి వేసిన విషయం తెలిసిందే. శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
శ్రీ కల్కి ధామ్ నిర్మాన్ ట్రస్టు కల్కి ధామ్ ఆలయాన్ని నిర్మిస్తున్నది. ఈ ట్రస్టు చైర్మెన్ ప్రమోద్ కృష్ణమ్. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. సాధువుల భక్తి, ప్రజల స్పూర్తి వల్లే కల్కి ఆలయ నిర్మాణానికి నాంది పడిందన్నారు. పెద్ద పెద్ద సాధువులు, ఆచార్యుల సమక్షంలో తాను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారతీయ విశ్వాసాలకు కల్కి ధామ్ కేంద్ర బిందువుగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ హయాంలోనే కాశీలోని విశ్వనాథ్ థామ్ అభివృద్ధి జరిగిందన్నారు. ఉజ్జయినిలో మహాకాల్ ఆలయ అభివృద్ధి కూడా జరిగిందన్నారు. ఈ కాలంలోనే సోమనాథ్, కేదార్నాథ్ డెవలప్మెంట్ జరిగిందన్నారు. అభివృద్ధితో పాటు వారసత్వ మంత్రాన్ని అవలంబిస్తున్నామన్నారు. ఒకవైపు దైవక్షేత్రాలను అభివృద్ది చేస్తున్నామని, మరో వైపు నగరాల్లో హైటెక్ మౌళికసదుపాయాల్ని కల్పిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఆలయాలను పునర్ నిర్మించడంతో పాటు దేశవ్యాప్తంగా వైద్యశాలలను కూడా కట్టిస్తున్నామన్నారు. విదేశాల్లో మన పూర్వీకుల శిల్పాలను తెప్పిస్తున్నామని, అలాగే విదేశీ పెట్టుబడులు కూడా రికార్డు స్థాయిలో వస్తున్నాయన్నారు.
#WATCH | PM Modi says “…It is during this period that we have seen Vishwanath Dham flourishing in Kashi. During this period we are witnessing the rejuvenation of Kashi. It is during this period that we have seen the glory of Mahalok of Mahakaal. We have seen the development of… pic.twitter.com/Aj2wE5CYja
— ANI (@ANI) February 19, 2024